పాక్‌ దాడిని ఖండిస్తున్నాం: మంత్రి ఏకీ ఆంటోనీ

న్యూఢిల్లీ: నిన్న రాత్రి పాక్‌ సైనికులు భారత సైనికులపై జరిపిన కాల్పులపై భారత ప్రభుత్వం స్పందించింది. పాక్‌ సైనికులు జరిపిన ఘటనను ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నట్టు రక్షణ మంత్రి ఏకీ ఆంటోనీ లోక్‌సభలో ప్రకటించారు. పాకిస్థాన్‌ సైన్యం దుస్తుల్లో ఉన్నవారితోపాటు మరో 20 మంది తీవ్రవాదులు దాడికి పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. నిన్న పాక్‌ సైనికులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే.