మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాకిస్థాన్
న్యూఢిల్లీ,(జనంసాక్షి): భారత సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం మరోసారి కాల్పులకు తెగపడింది. నిన్న ఐదుగురు జవాన్లను పొట్టనపెట్టుకున్న పాక్ సైన్యం ఇవాల యూరి సెక్టార్లోని భారత ఆర్మీ బేస్ క్యాంపులపై కాల్పులు జరిపింది. పూంచ్ వద్ద జరిపిన కాల్పుల్లో ఐదుగురు భారత జవాన్లు మృతి చెందిన విషయం విదితమే. ఈ ఘటనపై ఉభయ సభల్లో విపక్షాల చర్చకు పట్టుబడుతున్న విషయం తెలిసిందే.