హాట్లైన్లో ఇరుదేశాల సైన్యాధికారుల సంభాషణ
ఢిల్లీ: పూంఛ్ సెక్టాల్లో కాల్పుల ఘటనపై భారత్, పాకిస్థాన్ దేశాల ఉన్నత స్థాయి మిలిటరీ అధికారులు బుధవారం హాట్లైన్లో సంభాషించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇరుదేశాల సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితిని తగ్గించడానికి భారత్, పాకిస్థాన్ దేశాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ చొరవ తీసుకున్నట్లు సమాచారం.