ఏకే ఆంటోనీ నేతృత్వంలో ఏపీ ఎన్నికల మేనిఫెస్టో అమలు కమిటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల మెనీఫెస్టో అమలు కమిటీ కాంగ్రెస్‌ అధిష్ఠానం బుధవారం ఏర్పాటు చేసింది. ఎనిమిది మంది సభ్యులతో మేనిఫెస్టో అమలు కమిటీని ఏర్పాటు చేసినట్లు అధిష్ఠానం ప్రకటించింది. ఏకే ఆంటోనీ నేతృత్వంలో ఈ కమిటీ పని చేస్తుంది. కమిటీలో సభ్యులుగా నారాయణస్వామి, కుంతియా,తిరువావుక్కరసు, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉండవల్లి అరుణ్‌కుమార్‌, గీతారెడ్డి ఉన్నారు.