తెలంగాణ చాలా ఏళ్లుగా నలుగుతుంది: దిగ్విజయ్‌సింగ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ సమస్య చాలా ఏళ్లుగా నలుగుతుందని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయని తెలిపారు. కుటుంబం లాంటి ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించడం కష్టమైన పని అని ఆయన అన్నారు. ఇరు రాష్ట్రాల నేతలు సమస్యలు ఉంటే ఆంటోని కమిటీకి చెప్పండి అని దిగ్విజయ్‌సింగ్‌ సూచించారు. ఆంటోనీ కమిటీ ఈ రోజు నుంచే పని చేస్తుందని చెప్పారు. ఎన్టీవోలు, విద్యార్థులు, అన్ని పక్షాల నాయకులు కమిటీ ముందు అభిప్రాయాలు చెప్పొచ్చు అని సూచించారు. ఏపీ ఎన్టీవోలు సమ్మెకు వెళ్లొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అందరికీ సంతృప్తి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.