మొదటి రౌండ్లో సైనా విజయం

చైనా,(జనంసాక్షి): ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో రాష్యా క్రీడాకారిణితో తలపడిన సైనా కేవలం 23నిమిషాల్లో ఆట ముగిసింది. 21-5, 21-4 సెట్లతో విజయం సాధించింది. రేపు ఆమె ప్రిక్వార్టర్‌ ఫైనాల్స్‌లో ఆడనుంది. మరో పక్క రాష్ట్ర క్రీడా కారిణి పీవీ సింధూ కూడా విజయం సాధించింది. జపాన్‌ క్రీడాకారిణితో తలపడిన సింధు 21-19, 19-21, 21-17 తేడాతో విజయం సాధించింది.