ప్రభుత్వ లాంఛనాలతో ప్రేమ్‌నాథ్‌ సింగ్‌ అంత్యక్రియలు

పాట్నా,(జనంసాక్షి): పాక్‌ సైన్యం జరిపిన కాల్పుల్లో మృతి చెందిన బీహార్‌ రెజిమెంట్‌ సైనికుడు ప్రేమ్‌నాథ్‌సింగ్‌ అంత్యక్రియలు గురువారం బీహార్‌లోని ఆయన స్వగ్రామం సమౌతాలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. బంధువులు, వందలాది ప్రజలు ప్రేమ్‌నాథ్‌కు ఘన నివాళి అర్పించారు.