సీఆర్‌పీఎఫ్‌ జవాను ఆత్మహత్య

రాయ్‌పూర్‌,(జనంసాక్షి): రాయ్‌పూర్‌లోని స్టాఫ్‌ క్వర్టర్స్‌ ఆఫ్‌ పార్లమెంటరీ ఫోర్సెస్‌లో తుపాకీతో కాల్చుకుని ఓ సీఆర్‌పీఎఫ్‌ జవాను ఆత్మహత్య చేసుకున్నాడు. 65 బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్‌ ఏఎస్‌రాయుడు తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని స్టేషన్‌హౌస్‌ ఆఫీసర్‌ వికాస్‌ థాకర్‌ తెలిపారు.