సీడబ్ల్యూసీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే: దిగ్విజయ్‌సింగ్‌

ఢిల్లీ,(జనంసాక్షి): సీడబ్ల్యూసీ నిర్ణయానికి కాంగ్రెస్‌ వాదులంతా కట్టుబడి ఉండాల్సిందేనని ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దిగ్విజయ్‌సింగ్‌ తేల్చి చెప్పారు. ఈ విషయంలో అందరికీ స్పష్టత ఉండాలని తెలిపారు. అంటోని కమిటీ మంగళవారం నుంచి పని ప్రారంభిస్తుందని చెప్పారు. తెలంగాణ ప్రక్రియ ఆగిపోలేదని వేగంగా కొనసాగుతుందన్నారు.