త్వరలో తెలంగాణ కళ సాకారం: సోనియాగాంధీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): త్వరలో తెలంగాణ సాకారం కానుందని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ పునరుద్ఘాటించారు. క్విట్‌ ఇండియా ఉద్యమ 71 వార్షికోత్సవం సందర్భంగా నిన్న రాష్ట్రపతి భవన్‌లో జరిపిన ఓ కార్యక్రమంలో ఆమె తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధులతో మాట్లాడారు. తెలంగాణపై సముచిత నిర్ణయం తీసుకున్నందుకు సోనియాను వారు అభినందించారు. తెలంగాణ పై నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆమె వారితో అన్నారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో తెలంగాణపై ప్రకటన చేస్తుందని ఆమె తెలిపారు. అంత వరకు తెలంగాణ ప్రజలు శాంతియుతంగా ఉండాలని అన్నారు.