త్వరలో రైళ్లలో నీటిశుద్ధి యంత్రాలు ఏర్పాటు చేయలన్న రైల్వేశాఖ
న్యూఢిల్లీ:సాధారణ రైలు ప్రయాణికులకూ సురక్షిత తాగునీరు అందుబాటులో ఉంచేందుకు బోగీల్లో నీటిశుద్ధి యంత్రాలను ఏర్పాటు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ సదుపాయం ఉండే తొలి బోగీ పంజాబ్లోని జలంధర్లో ఉన్న జగధ్రి రైల్వే వర్క్షాప్లో తయారవుతోందని రైల్వే శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రయోగాత్మక ప్రాతిపదికన త్వరలోనే ఆ బోగీని సుదూర ప్రయాణం చేసే ఒక ఎక్స్ప్రెస్ రైలుకు అనుసంధానించనున్నామని చెప్పారు.