అరగంటపాటు వాయిదా పడిన రాజ్యసభ
న్యూఢిల్లీ: రాజ్యసభలో విపక్ష సభ్యుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. సరిహద్దు వెంబడి పాక్ సైనికుల దురాగతాలపై విపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. జమ్మూకాశ్మీర్లోని కిష్టావర్ ఘటనపై భాజపా సభ్యులు చర్చకు పట్టుబట్టారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాలంటూ సీమాంధ్ర ప్రాంత తెదేపా సభ్యులు వెల్లోకి వెళ్లి నిరసన తెలిపారు. సభ్యులు శాంతించకపోవడంతో డిప్యూటీ ఛైర్యన్ సభను అరగంటపాటు వాయిదా వేశారు.