67కు చేరిన థానే మృతుల సంఖ్య

థానే : మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఏడంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 67కు చేరింది. నిన్న రాత్రి మరో నాలుగు మృతదేహాలను శిథిలాల నుంచి బయటకు తీశారు. ఘటనా స్థలంలోనూ మూడోరోజు కూడా సహాయక చర్యలు కొనసడగుతోన్నాయి. గాయపడ్డ అరవై మంది క్షతగాత్రులు వివిధ ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, పలువురు వ్యక్తులు ఇంకా శిథిలాల కిందే చిక్కుకుని ఉంటారని, సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని సహాయక చర్యలు పర్యవేక్షిసస్తోన్న జాతీయ విపత్తు స్పందన దళం అధికారి ఒకరు చెప్పారు.