67 కు చేరిన థానే మృతుల సంఖ్య

థానే, జనంసాక్షి: మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఏడంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 67కు చేరింది. నిన్న రాత్రి మరో నాలుగు మృతుదేహాలను శిథిలాల నుంచి బయటకు తీశారు. ఘటనా స్థలంలో మూడోరోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడ్డ అరవై మంది క్షతగాత్రులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా పలువురు వ్యక్తులు ఇంకా శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని, సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని  సహాయక చర్యలు పర్యవేక్షిస్తోన్న జాతీయ విపత్తు స్పందన దళం అధికారి ఒకరు చెప్పారు.