ఫైళ్ల గల్లంతుపై నేడు లోక్‌సభలో చర్చ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): బొగ్గు గనుల కేటాయింపు వ్యవహారంపై ఈ రోజు లోక్‌సభలో చర్చ జరగనుంది. ఫైళ్ల గల్లంతుపై ప్రధాని వివరణ ఇవ్వాలని గత కొన్ని రోజులుగా ఉభయ సభల్లో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బొగ్గు వ్యవహారంపై సమాధానికి సిద్దమని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రకటించారు.