రైతు బజార్‌లో రైతులపై దళారుల దాడి

ఖమ్మం: జిల్లా కేంద్రంలోని రైతు బజార్‌లో తమకు జాగా కేటాయించాలని కోరిన రైతులపై మార్కెట్లో ఉన్న దళారులు దాడి చేశారు. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.