హైదరాబాద్‌లో విధ్వంసానికి సీమాంధ్ర గుండాలొస్తున్నారు

 

రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దు
మనం సంయమనం పాటిద్దాం : హరీశ్‌రావు
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి):
హైదరాబాద్‌లో విధ్వంసం చేసేందుకు బెజవాడ రౌడీలు.. రాయలసీమ గూండాలు, ఫ్యాక్షనిస్టులు వస్తున్నారని, ఈ కుట్ర వెనుక ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ దినేష్‌రెడ్డి హస్తం ఉందని టీఆర్‌ఎస్‌ ఎల్పీ ఉప నాయకుడు హరీష్‌రావు ఆరోపించారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. రౌడీలంతా ఇప్పటికే హైదరాబా ద్‌లో ఉన్న ఫాంహౌస్‌లు, హోటళ్లు, లాడ్జింగ్‌లలో దిగారని, వీరి ఆగడా లను నియంత్రించేందుకు పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తెలంగాణ ఉద్యమకారులు, సభలు, సమావేశాలు నిర్వహిస్తే ముందస్తు అరెస్టులు, బైండోవర్లు, కేసులు, జైలల్లో పెట్టారని అన్నారు. ఉద్యమకారులు హైదరాబాద్‌నగర్‌లోకి రావాలంటే ముళ్లకం చెలు, బారికేడ్లు దాటుకుని, పోలీసుల బాష్పవాయువు గోళాలు, లాఠీచా ర్జిలు ఎదుర్కొవాల్సి వచ్చిందని, కాని ఏపీఎన్జీఓల సభకు మాత్రం రెడ్‌కార్పెట్‌ వేసి ఐదు రోజుల ముందే వారికి సభ నిర్వహణకు అను మతి ఇవ్వడంలో కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. తెలంగాణ వాదుల శాంతి ర్యాలీ నిర్వహించేందుకు కూడా అనుమతి ఇవ్వని ముఖ్యమంత్రి ఏపీఎన్జీఓల సభకు మాత్రం ఆగమేఘాలపై అనుమతి ఇవ్వడంలో అర్థమేమిటన్నారు. ముఖ్యమంత్రి సీమాంధ్ర ప్రాంతానికే బాధ్యులుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలోని యూనివర్సిటీలన్నింటినీ పోలీసు క్యాంపులుగా మార్చారని, సీమాంధ్రలో అల్లరిమూకలు ఎంత గొడవ చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని మండిపడ్డారు. కిరణ్‌కుమార్‌రెడ్డి కేవలం 13 జిల్లాలకే ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులపై చీఫ్‌ సెక్రటరీ కేంద్రానికి వాస్తవ నివేదిక అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. శనివారం నగరంలో సీమాంధ్ర గూండాలు, రౌడీలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారని, అయినా తెలంగాణ ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి వైఖరికి నిరసనగానే తాము శనివారం బంద్‌ను పిలుపునిచ్చామని, ఈ బంద్‌ను జయప్రదం చేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.