బలవంతపు భూసేకరణతోనే నక్సలిజం :జైరాం రమేష్‌

న్యూఢిల్లీ : దేశంలో జరుగుతున్న బలవంతపు భూసేకరణతోనే నక్సలిజం వ్యాపిస్తోందని కేంద్రమంత్రి జైరాం రమేష్‌ అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన కంపెనీలు జరుపుతున్న భూసేకరణ వివాదస్పదమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. భూసేకరణపై కేంద్రం తీసుకువచ్చిన నూతన చట్టం అందరీకి ఆమోదయోగ్యంగా ఉందన్నారు.