70వ పడిలో చంద్రబాబు
శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ
జగన్, కెటిఆర్ తదితరులు
అమరావతి,ఏప్రిల్20(జనంసాక్షి): 70వ పడిలో పడి పుట్టినరోజు జరుపుకొంటున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్రమోదీ ట్విటర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో కలకాలం జీవించాలని ఆకాంక్షించారు. ప్రతిపక్ష నేత జగన్ కూడా ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం చంద్రబాబుకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు శుభాకంక్షలు చెప్పారు. ట్విట్టర్ ద్వారా చంద్రబాబుకు బర్త్డే విషెస్ తెలిపారు. సంపూర్ణ ఆరోగ్యంతో కలకాలం జీవించాలని ఆకాంక్షించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాల్లో చంద్రబాబు జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. పుట్టిన రోజును పురస్కరించుకుని సీఎం చంద్రబాబు హైదరాబాద్ వెళ్లనున్నారు. అక్కడి నుంచి సాయంత్రం తిరుపతికి చేరుకుంటారు. తిరుపతిలోని కోటకొమ్మలవీధిలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తనిధి కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, రోహిత్ తదితరులు పాల్గొంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలను రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ శనివారం తన కార్యాలయంలో నిర్వహించారు. కేక్ కట్ చేసి నాయకులకు, అభిమానులకు తినిపించారు. అనంతరం విూడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు వంటి మహానాయకుని సేవలు ఎపీకే కాకుండా, దేశానికి కూడా ఎంతో అవసరమన్నారు. భవిష్యత్లో చంద్రబాబు దేశ రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తారన్నారు. సీఎం పని తీరు గుర్తించిన ప్రజలు ఎపీలో మరోసారి టీడీపీకే కట్టనున్నారని అభిప్రాయపడ్డారు. దేశంలో కూడా బీజేపీయేతర కూటమే అధికారంలోకి వస్తుందని తెలిపారు.