కలుషిత నీరు తాగి 70 మంది ఆస్పత్రి పాలైన విద్యార్థులు

పాట్నా: బీహార్‌లోని చాప్రా, సీతామర్హి జిల్లాల్లో పాఠశాలల వద్ద ఉన్న బోరుబావుల నీళ్లు తాగి దాదాపు 70 మంది చిన్నారులు ఆస్పత్రి పాలయ్యారు. చాప్రాలో 12 మంది, సీతామర్హిలో 55 మంది బాలికలు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. బాలికలు నీరు తాగిన వెంటనే స్సృహతప్పిపోయారని, వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా వారి పరిస్థితి ఇప్పుడు స్థిరంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ సంఘటనల నేపథ్యంలో తాగునీటిని పరీక్షించాలని పాఠశాలలను ఆదేశించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.