ఖమ్మంలో ఘనంగా పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం

హైదరాబాద్‌ : ఖమ్మంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడులు జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ శ్రీనరేష్‌,ఎస్పీ రంగనాథ్‌ హాజరయ్యారు. విథి నిర్వహణలో అమరులైన పోలీసులకు నివాళులర్పించారు. అమరవీరుల కుటుంబసభ్యులతో కలెక్టర్‌ మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.