ఆధిక్యంలో దక్షిణాఫ్రికా

డర్బన్‌ : భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మ్యాచ్‌ పై పట్టు సాధించింది. మూడో రోజు (శనివారం) ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. నాలుగో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా 127 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 369 పరుగులు చేసింది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 334 పరుగులు చేసి ఆలౌగైంది. దీంతో దక్షిణాఫ్రికా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.