80 శాతం మార్కులు సాధించిన విద్యార్థినిపై యాసిడ్ దాడి..

కోల్ కతా : హయ్యర్ సెకండరీ ఎగ్జామ్స్ లో 80 శాతం మార్కులు సాధించిన విద్యార్థినిపై ఓ ఆగంతకుడు యాసిడ్ దాడి చేశాడు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో విద్యార్థినికి తల, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. పశ్చిమ మిడ్నాపూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్ఎస్ఎస్ కేమ్ ఆసుపత్రిలో విద్యార్థిని చికిత్స పొందుతోంది.