9వ తరగతి చదువుతున్నబాలికపై గ్యాంగ్ రేప్..

ఢిల్లీ : దేశ రాజధానిలో అత్యాచార ఘటనలు పెరిగిపోతూనే ఉన్నాయి. 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని కిడ్నాప్ చేసి ఆమెపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. నజఫ్ గఢ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టునట్లు తెలుస్తోంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన అంతా వీడియో తీశారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఫేస్ బుక్ లో పెడుతామని వారు బెదిరించారని బాలిక వాపోయింది.