రేపు నామినేటెడ్, పార్టీ పదవులకు దరఖాస్తుల స్వీకరణ

– మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోట్ల తిరుపతి యాదవ్ మంథని, (జనంసాక్షి) : నామినేటెడ్ పదవులకు, పార్టీ పదవులకు ఆశావాహుల నుంచి గురువారం దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు రామగిరి మండలం పన్నూరు లోని సత్య ఏసి ఫంక్షన్ హాల్ పన్నూర్ లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. మంథని నియోజకవర్గ మంథని బ్లాక్ పరిధిలోని మంథని మున్సిపల్, మంథని, రామగిరి, ముత్తారం, కమాన్పూర్ నాలుగు మండలాలకు చెందిన మండల అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, నామినేటెడ్ పదవుల ఆశావహుల నుండి దరఖాస్తులు స్వీకరించుటకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశానుసారం ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు, తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్, టిపిసిసి పరిశీలకులు అజ్మతుల్లా హుస్సేన్, సంగీతం శ్రీనివాస్ హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. నాలుగు మండలాల, పాలకుర్తి లోని నాలుగు గ్రామాల కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ సకాలంలో హాజరుకావాలని తిరుపతి యాదవ్ ఈ సందర్భంగా కోరారు.