విద్యుత్ కోతలకు నిరసనగా ఆర్టీసీ డిపో ముట్టడి
ఖమ్మం: విద్యుత్ కోతలకు నిరసనగా వైకాపా నేతలు ఆర్టీసీ డిపో ముందు నిరసన చేపట్టారు. బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు.
ఖమ్మం: విద్యుత్ కోతలకు నిరసనగా వైకాపా నేతలు ఆర్టీసీ డిపో ముందు నిరసన చేపట్టారు. బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు.
మహబూబ్నగర్: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ 2రోజు ప్రారంభమైంది. 15001నుంచి30,000 ర్యాంక్ల వరకు అభ్యర్థులను కౌన్సిలింగ్కు పిలిచారు.
మహబూబ్నగర్: ఈ నెల 29న జాతీయా క్రీడా దినోత్సవం పురస్కరించుకుని డీఎన్ఏ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు కబడ్డి, వాలిబాల్ పోటీలు నిర్వహభించ నున్నట్లు డీఎన్ఏవో కార్యలయం తెలిపింది.
మహబూబ్నగర్: నేటి నుండి బాల్య వివాహాలు అరికట్టడానికి శిక్షణ నిర్వహిస్తున్నట్లు చైతన్య వికలాంగుల వేధిక తెలిపింది. ఈ నెల 29వరకు జరనుంది.
మహబూబ్నగర్: నేటి డీఎస్సీ పరిక్షకు 18కేంద్రాల్లో 3,900మంది అభ్యర్థులు హాజరయ్యరు. జిల్లా కలెక్టర్ పరిక్షకేంద్రాలను పరిశీలించారు.
మహబూబ్నగర్: అలంపూర్ మండలంలోని బుక్కపూర్ గ్రామంలో అతిసారంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు. 52 మంది అస్వస్థలైనట్లు తెలుస్తుంది. వీరందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా మానవపాడు మండలం కల్లుగొంట్లలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 15 లారీలను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. లారీలను సీజ్ చేసినట్లు అధికారులు తెలియజేశారు.