తెలంగాణ

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన ఓ ఆటోడ్రైవర్‌

కేపీహెచ్‌బీ కాలనీ, హైదరాబాద్‌: మూసాపేట్‌లో భవానీనగర్‌కు చెందిన దుర్గా దేవయ్య దంపతులు వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఐదేళ్లపాప ఉంది. స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో ఎల్‌కేజీ …

తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌ నిలిపివేత

మహబూబ్‌నగర్‌: తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌లో అధికారులు నిలిపివేశారు. డీజిల్‌ ట్యాంక్‌ లీక్‌ అయినట్లు గుర్తించి మరమ్మతు పనులు చేపట్టారు.

టింబర్‌ డిపోలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది

హైదరాబాద్‌: మలక్‌పేట మూసారంబాగ్‌లోని టింబర్‌ డిపోలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు …

భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి చక్రతీర్థం స్నానం

ఖమ్మం: భద్రాచలంలో శ్రీసీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఇందులో భాగంగా గోదావరి తీరంలో చక్రతీర్థం స్నానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

కాంతనపల్లి ప్రాజెక్టు సవరించిన ఆంచనాలకు ఆమోదం

హైదరాబాద్‌:పి.వి నరసింహారావు కంతనపల్లి సుజల స్రవంతి బ్యారేజ్‌ పవర్‌ బ్లాక్‌ల నిర్మాణానికి సవరించిన అంచనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.రూ.2,345 కోట్లతో కోత్తగా అంచనాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

జూపార్కులొ ఎలుగుబంటి దాడి

హైదరాబాద్‌:నెహ్రూ జూపార్కులో సందర్శకులపై ఎలుగుబంటి దాడి చేసింది.ఈ దాడిలొ ముగ్గురు గాయపడ్డారు.వారిని వెంటనే స్థానిక ఆస్పుత్రికి తరలించారు. ఈ ఘటనతో సందర్శకులు భయందోళనకు గురైయ్యారు.

సీబీఐ ఎదుట హాజరైన ఏపీఐఐసీ అధికారులు

హైదరాబాద్‌:సీబీఐ ఎదుట ఏపీఐఐసీ అధికారులు హాజరయ్యారు.జగన్‌ అక్రమాస్తుల కేసుకు సంబంధించి వీరిని సీబీఐ విచారిస్తోంది.

కానిస్టేబుల్‌పై కత్తితో దాడి

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ కానిస్టేబుల్‌ కృష్ణపై అతని బంధువులు కత్తితో దాడి చేశారు.కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.దాడిలో గాయపడిన కృష్ణను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి …

బోగ్గులకుంటల బుక్స్‌గోడౌన్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌:నగరంలొని రాంకోఠి ప్రాంతంలొని బొగ్గులకుంటలొ ఓ బుక్స్‌ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది.మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్నాయి.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని …

భూపాలపల్లిలో థర్మల్‌ పవర్‌ప్లాంట్‌

వరంగల్‌:జిల్లాలోని భూపాలపల్లిలో కాకాతీయ ఫేజ్‌-3థర్మల్‌ విద్యుత్పత్తి కేంద్రం ఏర్పాటుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమోదముద్ర వేశారు.