పోలీసుల పహార మధ్య కూల్చివేతలు..

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి జూన్ 16 (జనంసాక్షి): వేములవాడలో బ్రిడ్జి నుండి దేవాలయం వరకు రోడ్ల విస్తరణ పనులు చేపడుతున్నారు.210 దుకాణాలు కూల్చివేసేందుకు 250 పోలీసుల భారీ బందోబస్తుతో కూల్చివేతలు చేపడుతున్నారు.బ్రిడ్జి నుండి దేవాలయం వరకు నష్టపరిహారం తీసుకున్న వారి 70 ఇళ్ళను ముందుగా తొలగిస్తున్నారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం ఇక్కడ తిష్ట వేసి పనులు చేపడుతున్నారు. కూల్చివేత ప్రక్రియలో 15 జెసిబిలు నాలుగు కట్టర్ మిషన్లు, అంబులెన్స్లు,అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేశారు.రోడ్ల విస్తరణలో భూనిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం రూ 47 కోట్లు మంజూరు చేశారు.కూల్చివేత కార్యక్రమంలో మున్సిపల్, రెవెన్యూ, పోలీస్, ఆర్ అండ్ బి, వివిధ శాఖల అధికారుల పర్యవేక్షణలో విస్తరణ పనులు కొనసాగుతున్నాయి.