మేనిఫెస్టోలో రైతులు, మహిళలకు పెద్దపీట : కేటీఆర్‌

మేనిఫెస్టోలో రైతులు, మహిళలకు పెద్దపీట : కేటీఆర్‌
హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో రైతులు, మహిళలకు పెద్దపీట వేస్తామని మంత్రి కేటీఆర్‌ వెల్లడిరచారు. అదేవిధంగా బలహీనవర్గాలు, దళితులు, మైనార్టీ, గిరిజనులకు ఊతకర్రలా బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని చెప్పారు. పెన్షనర్ల ప్రయోజనాలకూ పెద్దపీట వేస్తామన్నారు. ఆర్థిక క్రమశిక్షణలో తాము ముందున్నామని, ఏదీ సాధ్యమో ఏది అసాధ్యమో తమకు తెలుసన్నారు. గత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఇప్పటివరకు 95శాతం నిలబెట్టుకున్నామన్నారు.