బనకచర్లపై సర్కారు సమరశంఖం

` నేడు తెలంగాణ ఎంపీలతో సమావేశం
` ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌ రెడ్డి
` గౌరవ అతిథులుగా కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండిసంజయ్‌
` ఎంఐఎం ఎంపీలు హాజరుకావాలని లేఖలు
` తెలంగాణ ప్రజల నీటి హక్కులపై ప్రాజెక్టు ప్రతికూల ప్రభావం చూపుతుంది.
` ఈ విషయమై కేంద్రానికి అభ్యంతరాలు తెలిపాం
` సీఎం రేవంత్‌రెడ్డి, నేను లేఖలు రాశాం: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి): గోదావరి-బనకచర్ల లింక్‌ప్రాజెక్టు విషయంలో వపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి అనుసరించాల్సిన కార్యాచరణ కోసం తెలంగాణ ఎంపీలతో రాష్ట్ర ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసింది. బుధవారం సాయంత్రం 4 గంటలకు సమావేశం నిర్వహించనున్నట్లు నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని, రాష్టాన్రికి చెందిన కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ను గౌరవ అతిథులుగా ఆహ్వానించినట్లు చెప్పారు. కాంగ్రెస్‌తోపాటు భాజపా, భారాస, మజ్లిస్‌ పార్టీలకు చెందిన లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలకు లేఖలు రాయడంతోపాటు స్వయంగా ఫోన్‌ చేసిన ఆహ్వానించామని తెలిపారు. ‘ట్రైబ్యునల్‌, చట్టాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం చేపట్టిన గోదావరి- బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వానికి అభ్యంతరాలు తెలిపాం. సీఎం రేవంత్‌రెడ్డి, నేను లేఖలు రాశాం. జల శక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ను కూడా కలిశాం. ఏపీ ప్రతిపాదిస్తున్న ఈ ప్రాజెక్టు తెలంగాణ ప్రజల నీటి హక్కులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం కేంద్ర జల సంఘం వద్ద ఉన్న గోదావరి-బనకచర్ల ప్రీఫీజిబిలిటీ నివేదికను తిరస్కరించాలని కోరాం. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని తదుపరి కార్యాచరణ తీసుకోవడానికి గురువారం ఎంపీలతో సమావేశమై అందరి అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించాం‘అని ఉత్తమ్‌ తెలిపారు.

 

బనకచర్లతో నష్టం లేదట!
` ఆంధ్రా సర్కారు కల్లిబొల్లి మాటలు
` గోదావరి మిగులు జలాలతో బనకచర్ల
` సముద్రంలో కలిసే నీటినే వినియోగించేలా ప్లాన్‌
` ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదు
` మంత్రి నిమ్మల రామానాయుడు
అమరావతి(జనంసాక్షి):గోదావరి వరదల వల్ల ఎపికే ఎక్కువ నష్టం అని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పర్యావరణ అనుమతుల కోసమే కేంద్రానికి లేఖ రాశాం అని అన్నారు. ఈ సందర్భంగా నిమ్మల విూడియాతో మాట్లాడుతూ.. వరదల వల్ల నష్టపోతున్న ఎపికి.. నీళ్లు ఉపయోగించుకునే హక్కుఉందని చెప్పారు. గోదావరి నీళ్లు నిరుపయోగంగా సముద్రంలో కలుస్తున్నాయని, ఎగువ నీటి అవసరాలు తీరిన తర్వాతే బనకచర్లకు నీళ్లు వృథాగా పోతున్నాయని ఆ నీళ్లనే బనకచర్లకు వాడుకుంటాం అని తెలియజేశారు. రాజకీయ లబ్ది కోసమే బనకచర్లపై వైసిపి విమర్శలు చేస్తుందని మండిపడ్డారు. ప్రాజెక్టుతో ఎగువ రాష్టాల్రకు నష్టం లేదని అన్నారు. బనకచర్లపై అనవసర రాద్దాంతం చేస్తున్నారని, ప్రాజెక్టుపై అనుమానాలు అవసరం లేదు అని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్టాల్రకు ఎలాంటి నష్టం లేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ ప్రాజెక్టుపై ఆయన సచివాలయంలో పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఏటా గోదావరి నుంచి 3 వేల టీఎంసీలు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఆయన వివరించారు. ‘ప్రపంచంలోనే ఒక నదిలో ఒకే సమయంలో 50 లక్షల క్యూసెక్కులు ప్రవహించే నది గోదావరి. పోలవరం వద్ద లభ్యమయ్యే గోదావరి వరద జలాలను మాత్రమే ఉపయోగించుకుంటాం. వృథాగా సముద్రంలోకి పోయే నీటిని మాత్రమే బనకచర్లకు తరలిస్తాం. ఎక్కడా నికర జలాలను వాడట్లేదని స్పష్టంగా చెబుతున్నాం. ఎగువ రాష్టాల్రకు కేటాయించిన నీటిని వాడుకునే పరిస్థితి లేదని ఆయన వెల్లడిరచారు. బనకచర్ల ప్రాజెక్టుపై వాస్తవాలు ప్రజలకు తెలియాలని, దీనిపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, గత 50 ఏళ్లుగా గోదావరి నీరు వృధాగా 3000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోందని, ఇందులో 200 టీఎంసీల నీరు ఉపయోగించి బనకచర్లకు తరలించాలనే ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణ ఉద్దేశమని ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మూడు సెగ్మెంట్‌లుగా బనకచర్ల నిర్మాణం జరుగుతుందని, పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు.. ప్రకాశం బ్యారేజీ నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్‌ వరకు.. సెగ్మెంట్‌ 2: బొల్లాపల్లి నుంచి బనకచర్ల వరకు.. సెగ్మెంట్‌ 3.. ఇలా మూడు సెగ్మెంట్‌లలో నిర్మాణం జరుగుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడిరచారు. బనకచర్లపై వస్తున్న ఆరోపణలు కేవలం రాజకీయాల కోసమేనని, సాంకేతిక అంశాల కన్నా రాజకీయంపై దృష్టితోనే ఆరోపణలు చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. తెలంగాణలో అంతర్గత రాజకీయలు కోసం బనకచర్లపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి అనుమతి లేకుండా ఏపీ ప్రభుత్వం ముందుకు వెళుతోందని అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. అన్ని నియమ నిబంధనల ప్రకారమే అనుమతి తీసుకుని నిర్మాణం జరుగుతుందన్నారు. సీడబ్ల్యూసీకి ఇప్పటికే ప్రాధమిక నివేదిక ఇచ్చామని చెప్పారు. ఆమోదం లేకుండా డీపీఆర్‌ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారని, ప్రాధమిక నివేదిక ఆమోదం తెలిపాక డీపీఆర్‌ ఇస్తామని మంత్రి తెలిపారు. పోలవరం, బనకచర్ల అనుమతులు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని మరోసారి స్పష్టం చేశారు. ఏపీ జలదోపిడీ అని విమర్శలు చేస్తున్నారని, వరద జలాలు ఉపయోగించు కోవడం తమ హక్కు అని, దిగువ రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్‌ ఎగువ రాష్టాల్ర ప్రయోజనాలు… నీటి అవసరాలు తీరాక మాత్రమే వరద జలాలు ఉపయోగిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏ రాష్టాన్రికి ఎలాంటి నష్టం లేదని, ప్రతి ఏడాది 3వేల టీఎంసీల నీరు సముద్రంలోకి పోతోందన్నారు. ఒక ఏడాది 7 వేల టీఎంసీల నీరు సముద్రంలోకి వృధాగా పోయిందన్నారు. ఇంకా వర్షాకాలం పూర్తిగా రాకుండానే సముద్రంలోకి నీరు వృధాగా పోతోందని అన్నారు. కేసీఆర్‌ చేపట్టిన ప్రాజెక్టులకు సరైన అనుమతి తీసుకోలేదని ఆరోపించారు. పూర్తయిన ప్రాజెక్టులకే అనుమతి లేదని, ఇంకా ప్రారంభ దశలో ఉన్న ప్రాజెక్టుల అనుమతిపై మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రాజెక్టును ఆపాలన్న దురుద్దేశం తమకు లేదని… సీఎం చంద్రబాబుకు అసలే లేదని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. సీతారాం సాగర్‌ లిప్ట్‌కు కూడా మొన్ననే అనుమతి వచ్చిందని, కానీ 75 శాతం పనులు పూర్తయ్యాయని అన్నారు.దేవాదుల ఎత్తి పోతల పథకంతో పాటు చాలా ప్రాజెక్టులకు చంద్రబాబు సహకరించారని, బీమా ఎత్తిపోతల పథకానికి కూడా సహకారం అందించారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఎస్సార్‌ఎస్పీతో పాటు అనేక ప్రాజెక్టులకు చంద్రబాబు సహకరించారన్నారు. ఈ విషయాన్ని తెలంగాణా ప్రజలు గుర్తు పెట్టుకోవాలన్నారు. దిగువ రాష్టాల్రకు ఉన్న హక్కుల ప్రకారం చంద్రబాబు కొన్ని ప్రాజెక్టుల విషయంలో అభిప్రాయం చెప్పారు తప్ప అడ్డుకోవాలని కాదని అన్నారు. అపెక్స్‌లో ఇరు రాష్టాల్ర సీఎంల మాటలు మినిట్స్‌ రూపంలో ఉన్నాయన్నారు. రెండు రాష్టాల్రు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో ఉండాలని చంద్రబాబు చెప్పారని మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు.

తాజావార్తలు