మంత్రి వాకటి శ్రీహరిని కలిసిన ముదిరాజ్ సంఘం నాయకులు

మంథని, (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్య సంపద, క్రీడలు యువజన సేవల మంత్రిగా వాకటి శ్రీహరి ముదిరాజ్ సోమవారం అధికారికంగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొని మంత్రి శ్రీహరి ముదిరాజ్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు పిల్లి చంద్రశేఖర్ ముదిరాజ్, మన తెలంగాణ ఫిషరీ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు మాల కనకయ్య ముదిరాజ్, మన తెలంగాణ సొసైటీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు యావరాజు ముదిరాజ్, ముదిరాజ్ మహాసభ ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అయితరవేని కొమురయ్య తదితరులు పాల్గొని మంత్రి శ్రీహరి ముదిరాజ్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.