సింగరేణి ఎన్నికలు వాయిదా..

Singareni Election Postponed

హైదరాబాద్‌ (జనంసాక్షి బ్రేకింగ్‌) :

తెలంగాణా రాష్ట్రంలో ఈనెల 28వ తేదీన జరగవలసిన సింగరేణి ఎన్నికలను హైకోర్టు వాయిదా వేసింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమ ఎన్నికలను వాయిదా వేయాలన్న సింగరేణి అభ్యర్థనను హైకోర్టు అంగీకరించింది. సింగరేణి ఎన్నికలు డిసెంబరు నెల 27వ తేదీన నిర్వహించాలని హైకోర్టు పేర్కొంది. నవంబర్ 30వ తేదీలోపు ఓటర్ లిస్ట్ రెడీ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఎన్నికలకు సహకరిస్తామని రేపటిలోగా హామీ పత్రం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వర్కర్స్ యూనియన్ లను ఆదేశించిన కోర్టు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని పేర్కొంది. హైకోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ నెలలో 27వ తేదీన సింగరేణి ఎన్నికలు నిర్వహించనున్నారు.