అదుపుతప్పి పశువుల కొట్టంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పశువుల కొట్టంలోకిదూసుకెళ్లింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో కరంజీ (టి) గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… కరంజీ (టి) నుంచి ఆదిలాబాద్ వైపు వస్తున్న బస్సు ఆర్లీ(టి) గ్రామంలోకి రాగానే అదుపుతప్పి బస్సు రోడ్డు పక్కనే ఉన్న బక్కి ఆనిల్ అనే రైతు కొట్టంలోకి దూసుకెళ్లింది. కట్టేసి ఉన్న ఎద్దును ఢీ కొట్టింది. ఆ సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉండగా.. ఎవరికి ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.