యాసంగి పంటనష్టం మంజూరు
` నష్టపోయిన 5,528 ఎకరాలకు రూ. 51.52 కోట్లను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
` పరిహారం నేరుగా రైతుల ఖాతాల్లో జమ
హైదరాబాద్,మే28(జనంసాక్షి):తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి శుభవార్త చెప్పింది. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఆసరాగా నిలిచింది. రైతులకు ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పంట నష్ట పరిహారం నిధులను బుధవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇటీవల వడగంట్ల వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 29 జిల్లాల్లోని 5,528 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ అంచనా నివేదిక ప్రచారం ప్రభుత్వం రూ. 51.52 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేయాలని సంబంధిత అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మే నెలకు పంట నష్టపరిహారం నిధులను త్వరలోనే విడుదల చేస్తామని మంత్రి తుమ్మల ప్రకటించారు.