జగిత్యాల,నవంబర్4 (జనంసాక్షి) : భారీ వర్షాలతో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని ఎమ్మెల్యే డక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. గ్రామాల్లో వర్షానికి దెబ్బతిన పంటలను రైతులతో కలిసి అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోతకు వచ్చిన వరి పొలాలు వర్షంతో నేల కొరగడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగిందనీ, అలాగే కళ్లాల్లో ఆరబోసిన మక్కజొన్న, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసి రైతులు కోలుకోలేని పరిస్థితి నెలకొందన్నారు.
నష్టాన్ని వ్యవసాయ శాఖ అధికారులు సర్వే చేస్తున్నారని, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్కు వివరించి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బ్యాంకుల తప్పిదంతో బీమా కంపెనీలు పరిహారం చెల్లించేందుకు అడ్డంకులు ఎదురవుతున్నాయనీ, ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు.
పంట నష్టపోయిన రైతులకు అండ
Other News
- తెలంగాణ కాదు.. అప్పుల తెలంగాణగా మార్చారు
- స్థానిక అవసరాలకనుగుణంగా.. కంపెనీల ఏర్పాటుకు ప్రాధాన్యం
- పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకం
- జగన్కు కృతజ్ఞతలు తెలిపిన వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు
- ఈశాన్య రాష్టాల్ల్రో.. కాంగ్రెస్ నిప్పు పెడుతుంది
- విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
- బ్రాండ్ హైదరాబాద్ను.. బ్రాండీ హైదరాబాద్గా మార్చారు
- పాకిస్థాన్ దేవాలయానికి.. భారత్ యాత్రీకులు
- వివేకా హత్యను సీబీఐకి అప్పగించాలి
- క్యాబ్పై ఎవరూ ఆందోళన పడొద్దు