అట్టహాసంగ రామ్‌చరణ్‌ ఉపాసనల వివాహం

హైదరాబాద్‌: చిరంజీవి తనయుడు ప్రముఖ సిని హీరో రాంచరణ్‌ ఉపాసనల వివాహం ఈ రోజు ఉదయం మొయినాబాద్‌లోని టెంపుల్‌ ట్రీ పాంహౌస్‌లో భారి వివాహ వేదికపై అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువులతోపాటు సిని రాజకీయ ప్రముఖలు హాజరయినారు. రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు, సిఎం.కిరణ్‌, తమిళనాడు గవర్నర్‌ రోషయ్య,  తేదేపా అధినేత చంద్రబాబు నాయుడు, తెరాస అధినేత కేసిఆర్‌, అమితబచ్చన్‌, రజనీకాంత్‌, మోహన్‌బాబు తదితరులు నూతన వధువరులను ఆశీర్వాదించారు.