అమర్‌నాథ్‌ యాత్ర శుభారంభం

పహల్గాం( జమ్ముకాశ్మీర్‌): అత్యంత విశిష్ఠమైన అమర్‌నాథ్‌ యాత్ర సోమవారం ప్రారంభమైంది. జమ్ముకాశ్మీరు గవర్నర్‌ ఎన్‌.ఎన్‌.వోహ్రా సోమవారం ఉదయం విశ్వవిఖాత అమర్‌రాథ్‌ ఆలయంలో పూజలు నిర్వహించారు.బల్టాల్‌… నున్‌వాన్‌బేస్‌క్యాంపుల నుంచి యాత్రికులు బయలు దేరారు. అనుకూల వాతావరణ పరిస్థితుల మూలంగా కాస్త ఆలస్యంగానే ఈ యాత్ర మొదలైంది. రాత్రంతా కురిసిన వర్షాల మూలంగా రోడ్లు జారుడుగా తయారవడంతో తెల్లవారుజామున భక్తుల ప్రయాణానికి అనుమతించలేదని అమర్‌నాధ్‌ ఆలయ బోర్డు అధికారులు వెల్లడించారు. యాత్రికుల వెంట సీఆర్‌పీఎఫ్‌ జవానులు రక్షణగా బైలుదేరాలు. ఆగష్టు రెండో తేదిన అమర్‌నాధ్‌ యాత్ర పరిసమాప్తమౌతుంది.

తాజావార్తలు