అసోం అల్లర్లపై ఏడు కేసులు నమోదు

ఢిల్లీ: అసోంలో చెలరేగిన అల్లర్లపై సీబీఐ ఏడు కేసులు నమోదు చేసింది. అల్లర్లపై విచారణకు అసోం ప్రభుత్వం ఆదేశించడంతో సీబీఐ ఉన్నతస్థాయి బృందాన్ని వేసింది. అల్లర్లకు ప్రభావితమైన కోక్రాఝర్‌ జిల్లాలో పర్యటించిన సీబీఐ బృందం ఈ ఏడు కేసులను నమోదు చేసింది.