ఐఏఎన్‌లను కాల్చిపారేయాలన్న వ్యాఖ్యలపై మంత్రి టీజీ వివరణ

హైదరాబాద్‌: ఐఏఎస్‌ అధికారులను కాల్చిపారేయాలన్న వ్యాఖ్యలు వివాదాస్సదం కావడంతో మంత్రి టీజీ వెంకటేష్‌ వాటికి వివరణ ఇచ్చారు. పనిచేయని రాజకీయ నేతలు, అధికారులను కాల్చివేసేలా చట్టసవరణ చేయాలని తాను అన్నానని ఆయన చెప్పారు. చిన్ననీటి పారుదలశాఖ పనులు చేయకపోతే తాము అత్మహత్యలు చేసుకుంటామన్న రైతుల ఆవేదనతో తాను అలా మాట్టాడాల్సి వచ్చిదని మంత్రి చెప్పారు. పనిచేయని కొడుకు బతికినా ఒకటే. చనిపోయినా ఒకటేనని తల్లిదండ్రులు అంటుంటారని. అలాంటప్పుడు జీతాలు తీసుకుంటున్న ఐఏఎస్‌ అధికారులకు భయం ఎందుకు ఉండదని టీజీ ప్రశ్నించారు. తప్పులు నరిదిద్దుకుంటామని ఎవరైనా ఐఏఎస్‌ అధికారులు ముందుకు వస్తే వారికి క్షమాపణ చెప్పేందుకు తాను సిద్దమని అయన స్పష్టం చేశారు.