కోర్టులో హాజరైన రాందాన్‌.. వారెంట్లు రద్దు

న్యూఢిల్లీ: అవినీతి కేసులో కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ మంత్రి, పీఎంకే నేత అన్బుమణి రాందాన్‌ మంగళవారం స్థానిక న్యాయస్థానంలో హాజరయ్యారు. దీంతో సీబీఐ న్యాయమూర్తి తల్వంత్‌సింగ్‌ ఈ నెల 7న ఆయనకు జారీ చేసిన బెయిలుకు  వీలైన వారెంట్లను రద్దు చేశారు. న్యాయస్థానంలో హాజరైన ఆయన బెయిలు పిటిషన్‌ దాఖలు చేశారు.  అధ్యాపకులు ,మౌలిక సదుపాయాలు లేని మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వైద్య కళాశాలకు అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలపై రాందాన్‌ విచారణ ఎదుర్కొంటున్నారు. దీనిపై ఈ నెల 29లోగా సమాధానం ఇవ్వాలంటూ న్యాయస్థానం సీబీఐకి నోటీసులు జారీ చేసింది.