ధర్మాన కమిటీ నేడు మరోమారు భేటీ

హైదరాబాద్‌:ఉప ఎన్నికల ఫలితాలపై సమీక్షించేందుకు మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో ఏర్పాటు చేసినకాంగ్రెస్‌ కమిటీ ఆదివారం మరోమారు సమావేశం కానుంది.మంత్రి రఘవీరారెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో జరగనున్న ఈ బేటీలో పార్టీ ప్రభుత్వ బలాలు,బలహీనతలు ప్రభుత్వ పథకాల్లో తీసుకురావాల్సిన మార్పులు చేర్పులు తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం నిన్ని తొలిసారిగా గాంధీభవన్‌లో ఈ కమిటీ సమావేశమై పార్టీ ప్రభుత్వ స్థితిగతులపై చర్చించింది.