నవ వధువు అనుమానాస్పద మృతి

విజయవాడ,మార్చి26 (జ‌నంసాక్షి) : కృష్ణా జిల్లా పెడన పట్టణంలో ఓ నవ వధువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె గుండెపోటుతో మరణించిందని అత్తింటి వారు అన్నారు. ఈ ఘటన గురువారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు  పెడన పట్టణానికి చెందిన ప్రకాశ్‌రావు కూతురు ధనలక్ష్మి(19)కి వివాహం ఈ నెల 11న జరిగింది. అయితే బుధవారం రాత్రి ధనలక్ష్మిగుండెపోటుతో మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌ మార్టంకు తరలించారు. అయితే దనలక్ష్మీ అనుమాస్పద స్థితిలో మరణించినట్టు ఆమె బంధువులు ఆరోపించారు.  అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అత్తారింటివారిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.