నేపాల్‌ ప్రధానిపై కేసు

ఖాట్మండు : ఓ  జర్నలిస్టు హత్య కేసు విచారణలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినందుకు నేపాల్‌ ప్రధానిబాబూరామ్‌ భట్టారాయ్‌కు ఆ దేశ సుప్రీం కోర్టు  కోర్టుధిక్కారం కింద సమన్లు జారీ చేసింది. ఆయనతో పాటు ఈ కేసుతో సంబధం ఉన్న అటార్నీ జనరల్‌ ముక్తీ నారాయణ్‌ ప్రధాన్‌కు లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని కోరింది.