బాలుడిని చితకబాదిన వార్డెన్
హైదరాబాద్: మీర్పేట్ పరిధిలో నందనవనం కాలనీలో లివింగ్ హోవ్ హాస్టల్లో 3వ తరగతి చదువుతున్న మహేష్ అనే విద్యార్థిని ఆ హాస్టల్ వార్డెన్ చితకబాదడంతో బాలుడి తల్లిదండ్రులు వార్డన్పై మీర్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. హాస్టల్లో టేబుల్పై ఉన్న తన సెల్ఫోన్ను పట్టుకుని ఆడుకుంటుండగా వార్డన్ డయానిల్ ఆ బాలుడిని కర్రతో వీపుపై, కాళ్లపై చితకబాదాడు, ఫిర్యాదులో పోలీసులు వార్డన్ను అదుపులోకి తీసుకున్నారు.