శ్రీలంకపై భారత్ విజయం
కొలంబో: కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్-శ్రీలంకల మధ్య జరిగిన మూడో వన్డే మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్లో భారత్కు 2-1 అధిక్యం లభించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 5 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. అనంతరం 287 పరుగుల లక్ష్యంతో దిగిన భారత్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.