సీఎంను కలిసిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌: సచావాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై సీఎంకు వినతి పత్రం అందజేశారు. వైద్యశాఖలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని సీఎంకు వివరించారు. గల్ఫ్‌ బాధితులను ఆదుకోవాలని సీఎం ను కోరారు. రామగుండంలో పవర్‌ స్టేషన్‌ను నిర్మించాలని ఆరు వినతిపత్రం సమర్పించారు.