‘సూర్యాపేట’ సంఘటనా స్థలాన్ని పరిశీలించిన దుగ్గల్

నల్గొండ:జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన దుగ్గల్ శుక్రవారం సూర్యాపేట బస్టాండ్‌ ఆవరణలోని ఘటనాస్థలాన్ని పరిశీలించారు. సూర్యాపేట బస్టాండ్ లో ఆగంతుకులు పోలీసులపై కాల్పులు జరపడం, ఇద్దరు పోలీసులు మరణించడాన్ని ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. ఘటనకు జిల్లా ఎస్పీ ప్రభాకరరావుని బాధ్యుడిని చేసి అతడిని హైదరాబాద్ సీఐడీకి బదిలీ చేసింది. ఆయన స్థానంలో విక్రమ్ జిత్ దుగ్గల్ కొత్త ఎస్పీగా నియమించింది. జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న వెంటనే దుగ్గల్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.