ప్రభుత్వ కొలువు ల భర్తీ కినోటిఫికేషన్ జారీ నేపథ్యం లో యువతకు సువర్ణ అవకాశం #మీ భవిష్యత్ కు మీరే మార్గ నిర్దేశకులు:రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థ సారథి*. నల్గొండ బ్యూరో. జనం సాక్షి.అంకిత భావం,పట్టుదల,లక్ష్యం తో ఇష్ట పడి ఏకాగ్రత తో చదివితే పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థ సారథి అన్నారు.గురువారం నల్గొండ జిల్లా కేంద్రం లోని లక్ష్మీ గార్డెన్ లో జిల్లా యంత్రాంగం తరపున పోటీ పరీక్షలపై నిర్వహించిన అవగాహన సదస్సు లో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి పాల్గొని విద్యార్థినీ,విద్యార్థులకు అవగాహన,ప్రేరణ కలిగించారు. ఈ అవగాహన సదస్సులో పెద్ద సంఖ్య లో సుమారుగా 1000 మంది విద్యార్థినీ,విద్యార్థులు హాజరు అయ్యారు.ఎన్నికల కమిషనర్ గా ఉంటూ అన్ని జిల్లాల్లో తిరుగుతూ తనదైన శైలిలో లో ఉద్యోగాలు,పోటీ పరీక్షల్లో విజయం సాధించుటకు అవసరమైన పద్దతులు,సూచనలు,సలహాలు ఇస్తూ విద్యార్ధుల మధ్యకు వెళ్లి ప్రేరణ కలిగించారు.ఇప్పటికే నిజామాబాద్,వరంగల్,కరీంనగర్,మహబూబ్ నగర్ జిల్లా లో పర్యటించి ఈ రోజు నల్గొండ జిల్లా కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇంత పెద్ద సంఖ్య లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ లు జారీ చేసిన నేపథ్యం లో,యువత అందివచ్చిన ఈ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకొని ఉద్యోగం సాధించాలని ఆయన కోరారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఉన్నత స్థానం లో వుంటే ప్రజలకు సేవ చేసే అవకాశం,తృప్తి తో పాటు కుటుంబ జీవితం సుస్థిరత లభిస్తుందని అన్నారు. . జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని పైకి వచ్చిన వారమే ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నామని నాతో పాటు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ఆర్డిఓ, తహసీల్దార్, ఇతర జిల్లా అధికారులు ఆ విధంగా చదివి ఈ స్థాయిలో ఉన్న వారని ఆయన తెలిపారు.ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం లో చదివి ఐ. ఏ.ఎస్.అధికారిగా,జిల్లా కలెక్టర్ గా ప్రజలకు సేవలు అందించానని ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు. మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని ,కసితో ఇష్టపడి,ప్రణాళిక బద్దంగా చదివి విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ పరీక్షా సమయంలో మనం ఇన్ని రోజులు చదివిన అంశాలతో పాటు మన బుద్ధికి పరీక్ష అన్నారు. పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, మెంటల్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జి, మొదలగు సబ్జెక్టుల వారీగా చదవాలన్నారు. ఒక సబ్జెక్టును చాప్టర్ గా విభజించుకుని చదివి ముఖ్యమైన అంశాలను నోట్ బుక్ లో రికార్డ్ చేయాలని తెలిపారు. ఒక సబ్జెక్టుకు ఒక పుస్తకాన్ని మాత్రమే ఎంచుకుని చదవాలని బజార్లో దొరికే అనేక రకాల పుస్తకాలను చదివి సమయాన్ని కోల్పోవద్దని ఆయన సూచించారు. పరీక్షా సమయం దగ్గర పడుతున్నందున సెల్ ఫోన్ కు,సినిమాలకు,చాటింగ్ లకు దూరంగా ఉండాలని ఆయన కోరారు.బద్దకం,వాయిదా వేయడం,భయం,నిరాశ, నిందా రోపణలు,మొహమాటం,ఆత్మ న్యూనతా విడనాడి పాజిటివ్ దృక్పథం తో, ఆత్మ విశ్వాసం తో ముందుకు వెళ్లాలని ఉద్బోధించారు. మీకు అదృష్టం ఏంటంటే ఇప్పుడు పరీక్షలలో ఇంటర్వ్యూ అనేది తీసివేశారు కనుక, కష్టపడి పరీక్షలో ఎక్కువ మార్కులు సాధిస్తేనే ఉద్యోగం పక్కాగా వస్తుందని ఆయన తెలిపారు. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని మీకు తగ్గట్టుగా మీరే తీర్చిదిద్దుకోవాలని ఆయన అభ్యర్థులను సూచించారు. పరీక్షలో టైం మేనేజ్ మెంట్ కూడా ముఖ్యమెనదని గ్రహించి ఇచ్చిన సమయంలోనే మన పరీక్షా పేపర్లోని అన్ని ప్రశ్నలకు జవాబులు రాయాలని తెలిపారు. ముఖ్యంగా నల్లగొండ జిల్లాకు చారిత్రక నేపథ్యం కలదని ఆయన అనేక సంఘటనలు, వ్యక్తులు, చారిత్రక నేపథ్యం గురించి వివరించారు. స్వాతంత్ర సంగ్రామం, సాయుధ పోరాటం, తెలంగాణ ఉద్యమంలో జిల్లా కీలక భూమిక పోషించినదనీ,నల్గొండ జిల్లా చైతన్యవంతమైనదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఇటువంటి చైతన్యం కలిగిన జిల్లా నుండి ఎక్కువ సంఖ్య లో ప్రభుత్వ కొలువు లు సాధించాలని,మళ్లీ జిల్లాకు వస్తానని,ప్రభుత్వ కొలువులు సాధించిన విద్యార్థుల తో మాట్లాడి సన్మానం చేస్తానని అన్నారు.జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ, పోటీ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు ఎన్నికల కమీషనర్ బోధించిన అంశాలను, టైం మేనేజ్ మెంట్, సబ్జెక్టు వారీగా ఎలా చదవాలో చక్కగా వివరించినందున అభ్యర్థులు అవగాహన చెందారని భావిస్తున్నాను అన్నారు.. పోటీ పరీక్షల పాల్గొనే విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అభ్యర్థులను కోరారు.
ఈ అవగాహనా సదస్సుకు హాజరైన అభ్యర్థులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అనేక అంశాల గురించి బోధించి బోధించారు.
ఈ అవగాహన సదస్సులో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4, ఎస్ఐ, కానిస్టేబుల్, ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులు పాల్గొని తమ సందేహాలను అడిగి తెలుసుకున్నారు. సదస్సులో అనేక కొత్త విషయాలను తెలుసుకున్నాం అని ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వనమాల చంద్రశేఖర్, ఆర్ డి ఓ జగదీశ్వర్ రెడ్డి,జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రాజ్ కుమార్,బి.సి.సంక్షేమ శాఖ అభివ్రుద్ది అధికారిణి పుష్ప లత,మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి బాల కృష్ణ, తహాశిల్దార్ నాగార్జున, జిల్లా తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు రోడ్లు భవనాలు శాఖ అతిథి గృహం వద్ద ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ,అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్,అర్ డి. ఓ.జగదీశ్వర్ రెడ్డి,డి.పి. ఓ.విష్ణు వర్ధన్,జడ్.పి.సి. ఈ. ఓ ప్రేమ్ కరణ్ రెడ్డి,డి.పి.అర్. ఓ.పి. శ్రీని వాస్ ఘనంగా స్వాగతం పలికి మొక్కలు అంద చేశారు.