అంతక్రియలకు ఆర్థిక సహాయం

మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి
దోమ డిసెంబర్ 28(జనం సాక్షి)

దోమ మండల పరిధిలోని మోత్కూర్ గ్రామానికి చెందిన సలీం  మరణ వార్త తెలియగానే డిసిసి అధ్యక్షులు పరిగి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి  అందుబాటులో లేనందుకు దోమ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాలి విజయ్ కుమార్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి లతో రూ” 5000/-ఆర్థిక సాయం చేయించడం జరిగింది.సలీం  కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి వారి కుటుంబానికి ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీ టి.ఆర్.ఆర్  అండగా ఉంటారని  చెప్పారు.ఈ కార్యక్రమంలో మోత్కూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జీడి లింగం,చంద్రకాంత్ ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.