అంతరిక్ష పరిశోధనల్లో మరో అడుగు

నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్యా ఎల్‌`1 శాటిలైట్‌
సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో ప్రయత్నం
శ్రీహరికోట,సెప్టెంబర్‌2  జనం సాక్షి : అంతరిక్ష పరిశోధనల్లో మరో అడుగు పడిరది. వరుస విజయాల ఉత్సాహంతో ఉన్న ఇస్రో..చంద్రయాన్‌ స్ఫూర్తితో ఇప్పుడు ఆదిత్యుడిని అందుకునే ప్రయత్నంలో ఉంది. ఆదిత్యుడిపై పరిశోధనలకు గాను ఆదిత్యా ఎల్‌`1 శాటిలైట్‌ని నింగిలోకి ప్రవేశ పెట్టగా అది విజయవంతం గా దూసుకుని వెళ్లింది.  షార్‌ రాకెట్‌ ప్రయోగ కేంద్రం నుంచి సరిగ్గా 11.50 గంటలకి పీఎస్‌ఎల్‌వీ సీ`57 రాకెట్‌ ప్రయోగం జరిగింది. నిప్పులు చెరుగుతూ నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ సీ`57 రాకెట్‌ దూసుకెళ్లింది. 63 నిమిషాల పాటు 235 కి.విూ దూరం నింగిలోకి ప్రయాణించిన అనంతరం భూ స్థిర కక్ష్యలోకి ఆదిత్యా ఎల్‌`1 శాటిలైట్‌ని పీఎస్‌ఎల్వీ సీ`57 రాకెట్‌ ప్రవేశపెట్టనుంది. మిషన్‌ ఆదిత్య ప్రయోగానికి సుమారు రూ.378 కోట్లు ఇస్రో వెచ్చించింది. ఈ ప్రయోతగంతో షార్‌లో తీవ్ర ఉత్కంఠ చోటు చేసుకుంది. మిషన్‌ ఆదిత్య విజయంపై ఇస్రో శాస్త్రవేత్తలు గట్టి ధీమాతో ఉన్నారు. పీఎస్‌ఎల్‌వీ సీ`57 సైతం దిగ్విజయంగా నింగిలోకి దూసుకువెళుతోంది. చంద్రయాన్‌`3 విజయవంతంతో దూకుడువిూదున్న ఇస్రో ఆదిత్య ఎల్‌`1 ప్రయోగాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా నేడు పీఎస్‌ఎల్‌వీ సీ`57 రాకెట్‌ను ప్రయోగించింది. ఆదిత్య ఎల్‌`1 శాటిలైట్‌ను ఇస్రో లాగ్రాంజియన్‌ పాయింట్‌ `1లో కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నది. ఈ కక్ష్య భూమికి 15లక్షల కిలోవిూటర్ల దూరంలో ఉంది. అయితే ఈ కక్ష్యను చేరుకునేందుకు నాలుగు నెలల సమయం పట్టనుంది. సూర్యుడిపై ప్రయోగాల నేపథ్యంలో ఇస్రో ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. గతంలో కొన్ని దేశాలు సూర్యుడిపై ప్రయోగాలు చేపట్టాయి. అయితే ఆదిత్య ఎల్‌`1 మిషన్‌తో ఇస్రో ఎలాంటి పరిశోధనలు చేయనుందనేది ఆసక్తికరంగా మారింది.లాంచ్‌ వెహికిల్‌ ప్రజ్వలనం అన్ని దశల్లోనూ నిర్దేశితంగా జరిగింది. ఏడు పేలోడ్స్‌తో ఆదిత్య .. భాస్కరుడి దిశగా వెళ్తున్న విషయం తెలిసిందే. భూమికి 15 లక్షల కిలోవిూటర్ల దూరంలో ఉన్న ఎల్‌1 పాయింట్‌ వద్దకు ఆదిత్య వెళ్తోంది. అక్కడ నుంచి సూర్యుడిని ఆ స్పేస్‌క్రాప్ట్‌ స్టడీ చేయనున్నది. ఆదిత్య స్పేస్‌ క్రాప్ట్‌ ఎల్‌1పాయింట్‌కు చేరుకోవడం సాంకేతికంగా సవాల్‌తో కూడిన అంశమని ఇస్రో మాజీ శాస్త్రవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత మిలిస్వామి అన్నాదురై పేర్కొన్నారు. అయిదేళ్ల పాటు ఆ కక్ష్యలో ఆదిత్య భ్రమించడం అంత సులువైన అంశం కాదన్నారు. ఆదిత్యలో ఏడు పేలోడ్స్‌ ఉన్నాయని, శాస్త్రీయంగా ఇది కీలకంగా మారనున్నట్లు ఆయన చెప్పారు. భూమికి 15లక్షల కిలోవిూటర్ల దూరంలో ఉన్న ఈ కక్ష్యను చేరుకునేందుకు నాలుగు నెలల సమయం పట్టనున్నది. ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి మరోసారి ఇస్రోపైనే ఉన్నది. అయితే, సూర్యుడిపై ఇంతకు ముందు పలు దేశాలు ప్రయోగాలు చేపట్టాయి. అయితే, వీటికి భిన్నంగా ఆదిత్య ఎల్‌`1 మిషన్‌తో ఇస్రో భిన్నంగా  పరిశోధనలు చేయబోతున్నది. ఆదిత్య ఎల్‌`1 మిషన్‌లో భాగంగా ఇస్రో సూర్యుడిపై అధ్యయనం చేయనున్నది. ఇస్రో ఈ మిషన్‌ను తొలి స్పేస్‌ బేస్డ్‌ కేటగిరి ఇండియన్‌ సోలార్‌ మిషన్‌ అని తెలిపింది. స్పేస్‌ వెహికిల్‌ను భూమి నుంచి 1.5 మిలియన్‌ కిలోవిూటర్ల దూరంలోని సూర్యుడు`భూమి మధ్య లాగ్రాంజియన్‌ పాయింట్‌ 1హాలో కక్ష్యలో ప్రవేశపెట్టనున్నది. ఆదిత్య ఎల్‌`1 సూర్యుడి కరోనా నిర్మాణం, సౌర విస్ఫోటనాలు, సౌర తుఫానులకు కారణాలతో పాటు మూలాలు, కరోనా, కరోనల్‌ లూప్‌ ప్లాస్మా నిర్మాణంతో పాటు సాంద్రత, లక్షణాలతో పాటు పలు అంశాలపై పరిశోధనలు జరుపనున్నది.
అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఆగస్ట్‌ 2018లో పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ను పంపింది.
డిసెంబర్‌ 2021లో పార్కర్‌ సూర్యుడి ఎగువ వాతావరణంలో ఎగురుతూ.. కరోనాతో పాటు అయస్కాంత క్షేత్రాలపై పరిశోధనలు జరుపుతున్నది. స్పేస్‌ షటిల్‌ సూర్యుడికి దగ్గరగా వెళ్లడం ఇదే తొలిసారి అని నాసా తెలిపింది. సూర్యుడి నుంచి వచ్చే తీవ్రమైన వేడి, రేడియేషన్లను తట్టుకుని పార్కర్‌ సూర్యుడి గమనం, పనితీరు గురించి మరిన్ని కొత్త కోణాలను సేకరించింది. సూర్యుడి చుట్టూ ఉండే వలయాన్ని కరోనాగా పిలుస్తుండగా.. పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ అనే అంతరిక్ష నౌక కరోనాలోంచి కొద్దిసేపు ప్రయాణించింది. అలాగే, 2020లో నాసా యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీతో కలిసి మారుతున్న అంతరిక్ష వాతావరణంపై అన్వేషించేందుకు సోలార్‌ ఆర్బిటర్‌ను ప్రారంభించింది. సోలార్‌ ఆర్బిటర్‌, అంతర్గత హీలియోస్పియర్‌, పుట్టుకతో వచ్చే సోలార్‌ విండ్స్‌, సూర్యుడి ధ్రువ ప్రాంతాలపై పరిశోధనలు చేపట్టేందుకు మిషన్‌ను ప్రారంభించింది.జపాన్‌కు చెందిన జక్సా (జపాన్‌ ఏరోస్పేస్‌ ఎక్స్‌ఎª`లోరేషన్‌ ఏజెన్సీ) 1981లో తొలి సౌర పరిశీలన ఉపగ్రహం హినోటోరి మిషన్‌ను ప్రారంభించింది. హార్డ్‌ ఎక్స్‌`కిరణాలను ఉపయోగించి సోలార్‌ ప్లేమ్స్‌పై అధ్యయనం చేయడం దీని లక్ష్యం. 1995లో నాసా, ఈసా, సమన్వయంతో, 1998లో నాసాతో కలిసి ట్రాన్సియెంట్‌ రీజియన్‌, కరోనల్‌ ఎక్స్‌ప్లోరర్‌, 2006లో హినోడ్‌ను జపాన్‌ ప్రయోగించింది. అమెరికా, యూకే సహకారంతో జపాన్‌ మిషన్‌ చేపట్టింది. ఇది భూమిపై చంద్రుడి ప్రభావాన్ని అధ్యయనం చేస్తుంది.యూరప్‌ 1990 అక్టోబర్‌లో యూరప్‌ (యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ) సూర్యుడి ఎగువన, దిగువన ఉన్న అంతరిక్ష వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి యులిసెస్‌ మిషన్‌ను మొదలు పెట్టింది. నాసా, జాక్సా సహకారంతో ఈసా 2021లో ప్రోబా`2 ప్రయోగం చేపట్టింది. ఇది విజయంతమైన ప్రోబా`1 సిరీస్‌కు కొనసాగింపు.. ప్రోబా`2లో నాలుగు ప్రయోగాలు కొనసాగుతుండగా.. సూర్యుడికి రెండు సంబంధించినవే. ప్రోబా పూర్తి పేరు ప్రాజెక్ట్‌ ఫర్‌ ఆన్‌`బోర్డ్‌ అటానవిూ. యూరప్‌ ప్రయోగించే రాబోయే సౌర మిషన్లలో 2024లో ప్రోబా`3, 2025లో స్మైల్‌ మిషన్లు ఉన్నాయి. చైనా 2022 అక్టోబర్‌ 8న అడ్వాన్స్‌డ్‌ స్పేస్‌`బేస్డ్‌ సోలార్‌ అబ్జర్వేటరీని నేషనల్‌ స్పేస్‌ సైన్స్‌ సెంటర్‌, చైనీస్‌ అకాడవిూ ఆఫ్‌ సైన్సెస్‌  ప్రారంభించింది. ఇప్పుడు ఇస్రో ప్రయోగించే ఆదిత్య ఎల్‌1 ప్రయోగం ద్వారా సూర్యుని గురించి అధ్యయనం చేస్తున్న ఆయాదేశాల సరసన భారత్‌ నిలువన్నది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు సూర్యుడిపై ప్రయోగాలు చేపట్టిన దేశాలకు భిన్నంగా ఇస్రో ఎల్‌`1 పాయింట్‌లో శాటిలైట్‌ను ఉంచబోతున్నది. అక్కడి నుంచి సూర్యుడి పుట్టుక, అక్కడి పరిస్థితులు తదితర అంశాలను మిషన్‌ ద్వారా తెలుసుకోవాలని భావిస్తున్నారు. ఇస్రో ఆదిత్య ఎల్‌`1 ప్రయోగం చేపడుతుండగా.. భూమి మధ్య దూరం 150 మిలియన్‌ కిలోవిూటర్ల దూరంలో ప్రవేశపెట్టనున్నది. ఆదిత్య శాటిలైట్‌ను నేరుగా సూర్యుడి దగ్గరగా పంపరు.. భూమి నుంచి 15 లక్షల కిలోవిూటర్ల దూరంలోని లాంగ్రేజ్‌ పాయింట్‌`1 వద్ద ఉండే సుదీర్ఘమైన దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి చేర్చనున్నారు. సుమారు 127 రోజుల ప్రయాణం తర్వాత ఆదిత్య ఎల్‌`1 ఈ కక్ష్యలోకి చేరనుండగా.. గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేయనున్నది.